వెజిటెబుల్ క్లస్టర్కు టెండర్లు
ABN , First Publish Date - 2022-01-18T05:06:47+05:30 IST
వెజిటెబుల్ క్లస్టర్కు టెండర్లు
- రూ.97లక్షలతో షెడ్డు, వసతి భవనం
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలో ఎస్ఎ్ఫయుటీ(స్టేట్ ఫండ్ ఫర్ రీ జనరేటివ్ అఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీ) కింది రూ.4.70కోట్లతో కూరగాయలు, ఫ్రూట్ ప్రాసెసింగ్ క్లస్టర్ యూనిట్ మంజూరు చేసింది. దీనిలో భాగంగా తొలుత రెండు భవనాల నిర్మాణానికి రూ.97లక్షలతో టెండర్లు కాల్ఫర్ చేశామని ఉద్యావన జిల్లా అధికారి నీరజగాంధీ సోమవారం తెలిపారు. మేడ్చల్ మండలం పూడూరు సొసైటీకి మంజూరైన ఈ యూనిట్లో ప్రొక్యూర్మెంట్ వర్క్షెడ్డు, కామన్ ఫెసిలిటీ భవన నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. టెండర్లు పూర్తికాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామని, అనంతరం యంత్రసామగ్రిని దిగుమతి చేసుకుంటామన్నారు. ఈ యూనిట్ ప్రారంభమైతే కూరగాయలు, పండ్ల తోటల రైతులకు మార్కెటింగ్ సౌక ర్యంతో పాటు మంచి లాభాలు వస్తాయన్నారు.