మండుతున్న కూరగాయల ధరలు
ABN , First Publish Date - 2022-08-10T05:25:28+05:30 IST
కూరగాయల ధర లు మండుతున్నాయి.
నరసాపురం, ఆగస్టు 9: కూరగాయల ధర లు మండుతున్నాయి. టమాటా రైతు బజార్ లో కిలో రూ.20 చొప్పున, బయట మార్కెట్లో రూ.30 అమ్ముతున్నారు. బీరకాయలు రూ. 50–60 ఉన్నాయి. వంకా యలు కిలో రూ.60–70, చిక్కుడు రైతు బజార్లో కిలో రూ.110, బయ ట మార్కెట్లో రూ.120 ధర ఉంది. బెండకా య రూ.40–50, దొండకాయ రూ.40, కాకరకాయ రూ.50–60, క్యారెట్ రూ.50, బీట్రూట్ రూ.50–60 ధర పలుకు తున్నాయి. పొట్లకాయ రూ.20–25 దోసకాయ రూ.30, ఆనబకాయ రూ. 20–30 ఉన్నాయి. జూన్ ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లాలో ఉద్యానవన తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కృష్ణాజిల్లా మైలవరం నుంచి బెండకాయ, బీరకాయ, వంకాయలు దిగుమతి అవుతున్నాయి. దూబచర్ల నుంచి చిక్కుడు, వంగ, బెండ, మదనపల్లి నుంచి టమాట, తెలంగాణ నుంచి బీట్రూట్, క్యారెట్ దిగుమతి అవుతున్నాయి. వర్షాలు కొనసాగు తుండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.