వాహనాలు ఢీకొని స్తంభించిన ట్రాఫిక్‌

ABN , First Publish Date - 2021-12-04T04:34:59+05:30 IST

శైలం సమీపంలోని హఠకేశ్వరం వద్ద శుక్రవారం రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

వాహనాలు ఢీకొని స్తంభించిన ట్రాఫిక్‌
నిలిచిపోయిన వాహనాలు


శ్రీశైలం, డిసెంబరు 3: శ్రీశైలం సమీపంలోని హఠకేశ్వరం వద్ద శుక్రవారం రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. శ్రీశైలం వైపుగా వస్తున్న జీపును దోర్నాల వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు ఢీ కొనడంతో జీపు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ఘటన వలన సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయి దాదాపు గంటసేపు భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. అధికారులు వెంటనే స్పందించి ట్పాఫిక్‌ను క్లీయర్‌ చేశారు. 


Updated Date - 2021-12-04T04:34:59+05:30 IST