సరిహద్దు చెక్‌పోస్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-22T04:42:26+05:30 IST

రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కె.లతాకుమారి సూచించారు.

సరిహద్దు చెక్‌పోస్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న డీఎస్పీ

జీలుగుమిల్లి, జూన్‌ 21: రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కె.లతాకుమారి సూచించారు. ఆంధ్ర–తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సోమవారం డీఎస్పీ పలు వాహనాలు తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులు, మెడికల్‌ సర్వీసుల వాహనాలు తెలంగాణ నుంచి వచ్చే క్రమంలో తనిఖీ చేయాలన్నారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు రాత్రి సమయంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించకుండా వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండి గంజాయి, గుట్కా అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు.

Updated Date - 2021-06-22T04:42:26+05:30 IST