వేలివెన్నులో శ్రీరామ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-01-25T06:00:44+05:30 IST

వేలివెన్నులో అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సమర్ఫణ కార్యక్రమంలో భాగంగా భక్తులు శ్రీరామ పాదయాత్ర ఆదివారం నిర్వహించారు.

వేలివెన్నులో శ్రీరామ పాదయాత్ర

ఉండ్రాజవరం, జనవరి 24 : వేలివెన్నులో అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సమర్ఫణ కార్యక్రమంలో భాగంగా భక్తులు శ్రీరామ పాదయాత్ర ఆదివారం నిర్వహించారు. రామ జన్మభూమి కమిటీ పిలుపు మేరకు గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రాధాకృష్ణ ఆలయం వరకు వెయ్యి మందికిపైగా రామభక్తులతో యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ దత్తత శ్రీకర్త బూరుగుపల్లి శ్రీనివాస్‌, గ్రామంలోని 36 దేవాలయాల కమిటీల అధ్యక్షుడు, రామజన్మభూమి గ్రామ ప్రముఖ్‌ కంటి పూడి లక్ష్మీపతి తదితరుల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. 

Updated Date - 2021-01-25T06:00:44+05:30 IST