దేవాలయాల రక్షణ ప్రభుత్వానిదే కాదు.. ప్రజలది కూడా: వెల్లంపల్లి

ABN , First Publish Date - 2021-03-01T00:26:27+05:30 IST

హిందూ ఆచార్య సభ, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి, శివస్వామి, గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ దేవాలయ రాజకీయాలతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర చేస్తున్నారన్నారు..

దేవాలయాల రక్షణ ప్రభుత్వానిదే కాదు.. ప్రజలది కూడా: వెల్లంపల్లి

విజయవాడ: హిందూ ఆచార్య సభ, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శివస్వామి, గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ దేవాలయ రాజకీయాలతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంపై కొందరు స్వామీజీల తీరు బాధాకరమన్నారు. ‘‘దేవాలయాల రక్షణ ప్రభుత్వానిదే కాదు.. ప్రజలది కూడా. దేవాలయాలపై దాడుల కేసుల్లో 300 మందిని అరెస్ట్‌ చేశాం.  దేవాలయాల పేరిట రాజకీయాలు చేస్తున్న వారిని స్వామీజీలు ఉపేక్షిస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది.’’ అని వెల్లంపల్లి తెలిపారు. 

Updated Date - 2021-03-01T00:26:27+05:30 IST