వేల్పుల వీధి వేడుక అదుర్స్‌

ABN , First Publish Date - 2021-01-25T06:37:26+05:30 IST

పట్టణంలోని వేల్పుల వీధి గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది.

వేల్పుల వీధి వేడుక అదుర్స్‌
రేలారే... రేలారే ప్రదర్శన

  గౌరీపరమేశ్వరుల ఉత్సవానికి భారీగా తరలి రాక

  ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

అనకాపల్లి టౌన్‌, జనవరి 24 : పట్టణంలోని వేల్పుల వీధి గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం రాత్రి ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి పట్టణమంతా జనసంద్రంగా మారింది. చీకటిపడిన తరువాత విద్యుత్‌ కాంతులతో అనకాపల్లి దేదీప్యమానమైంది. రాత్రి ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. రహదారులన్నీ కిటకిటలాడాయి. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలు, బుర్రకథలు, రేలారే..రేలారే.. జానపద నృత్యాలు, నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో బాణసంచా కాల్పులను ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు. బాణసంచా వెలుగులు వేడుకకు హైలెట్‌గా నిలిచాయి.  ఆదివారం కూడా అమ్మవారిని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పురవీధుల్లో ఊరేగించారు. ఎటువంటి అవాంఛనీయ  ఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.


Updated Date - 2021-01-25T06:37:26+05:30 IST