సీతారాముల కల్యాణానికి ముస్తాబైన రాజన్న క్షేత్రం

ABN , First Publish Date - 2022-04-10T00:47:37+05:30 IST

సీతారాముల కల్యాణోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ క్షేత్రం ముస్తాబైంది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ

సీతారాముల కల్యాణానికి ముస్తాబైన రాజన్న క్షేత్రం

వేములవాడ: సీతారాముల కల్యాణోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ క్షేత్రం ముస్తాబైంది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామివారి కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా 10వ తేదీ ఆదివారం ఉదయం 11-55 గంటలకు  సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు 20 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయం, రాజగోపురం, ఆలయ పరిసరాల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. చైర్మన్‌ చాంబర్‌ ఎదుట విశాలమైన కల్యాణ వేదికను నిర్మించి పూలతో అలంకరించారు.

Updated Date - 2022-04-10T00:47:37+05:30 IST