
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట రద్దీగా మారింది. ఆదివారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ వంటి ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. టీఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు ఆదివారం కుటుంబ సమేతంగా రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి