వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-29T12:01:34+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో తొలుత రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో తొలుత రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వేములవాడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఫలితంగా వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట నిండిపోయింది. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం పంచిపెట్టారు. శుక్రవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి ఏర్పాట్లు పర్యవేక్షించడంతోపాటు పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Updated Date - 2022-01-29T12:01:34+05:30 IST