రాజన్న క్షేత్రంలో సంక్రాంతి సందడి
ABN , First Publish Date - 2021-01-16T06:01:46+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురు, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడ, జనవరి 15 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురు, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.