స్విమ్స్ డైరెక్టర్గా వెంగమ్మకు మూడో సారి అవకాశం
ABN , First Publish Date - 2021-07-30T07:14:40+05:30 IST
స్విమ్స్ డైరెక్టర్గా డాక్టర్ భూమా వెంగమ్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
తిరుపతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): స్విమ్స్ డైరెక్టర్గా డాక్టర్ భూమా వెంగమ్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు డైరెక్టర్తో పాటు స్విమ్స్ డీమ్డ్ వర్సిటీ వీసీగా కూడా ఆమె వ్యవహరించనున్నారు. 2009లో తొలిసారిగా డైరెక్టర్గా ఎంపికైన ఆమె సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డైరెక్టర్గా కొనసాగుతున్న ఆమెను మూడోసారి పూర్తి హోదాలో నియమించారు. స్విమ్స్కు అనుబంధంగా మహిళా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు వెంగమ్మ ఎంతో కృషిచేశారు.