దేశ పౌరులకు వెంకయ్య స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-07-02T08:30:05+05:30 IST

దేశ పౌరులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్ఫూర్తి అని, అంకితభావంతో కూడిన ఆయన సేవలు దేశానికి అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

దేశ పౌరులకు వెంకయ్య స్ఫూర్తి

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): దేశ పౌరులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్ఫూర్తి అని, అంకితభావంతో కూడిన ఆయన సేవలు దేశానికి అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం వెంకయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని కోవింద్‌, మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టిన వెంకయ్య శుక్రవారం 73వ పడిలోకి అడుగుపెట్టారు. ‘‘ఈ పుట్టినరోజునాడు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు సంతోషకరమైన, ఆరోగ్యకరమై దీర్ఘాయుష్షు ఇవ్వాలి. అలాగే అంకితభావంతో కూడిన మీ సేవలు దేశానికి కావాలి’ అని వెంకయ్య కు రాసిన లేఖలో కోవింద్‌ పేర్కొన్నారు. ‘‘వెంకయ్యనాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ దేశ పౌరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భగవంతుడు మీకు దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’అని మోదీ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-07-02T08:30:05+05:30 IST