Rajya Sabha MPల సస్పెన్షన్‌ను రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరణ

ABN , First Publish Date - 2021-11-30T18:04:04+05:30 IST

పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరించారు....

Rajya Sabha MPల సస్పెన్షన్‌ను రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరణ

న్యూఢిల్లీ: పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరించారు.ప్రస్తుత నిబంధనల ప్రకారమే ఎంపీలపై చర్యలు తీసుకున్నామని, 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయబోమని రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఎంపీల సస్పెన్షన్ ను రద్దు చేయాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని తాను పరిగణనలోకి తీసుకోవడం లేదని నాయుడు అన్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారని‌, క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని మల్లికార్జున్‌ ఖర్గే చెప్పారు.దీనిపై రాజ్యసభ ఛైర్మన్ కు ఎంపీలపై చర్య తీసుకునే అధికారం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. గత వర్షాకాల సమావేశాల చేదు అనుభవం మనలో చాలా మందిని వెంటాడుతూనే ఉం వెంకయ్య చెప్పారు.


ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమని కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యసభలో ఓటింగ్ సంఖ్యను పెంచుకునేందుకు సస్పెండ్ చేశారని ఆయన ఎత్తి చూపారు.‘‘రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా బీజేపీ మెజారిటీ కంటే ముందుంది.. ఇప్పుడు ఎగువ సభ ద్వారా జాబితా చేసిన బిల్లులను సులభంగా ఆమోదించగలదు’’ అని అభిషేక్  ట్వీట్ చేశారు.కాగా సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11 నాటి సంఘటనలకు సంబంధించి అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రభుత్వం 12మంది ఎంపీలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని, అయితే వారు క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.


Updated Date - 2021-11-30T18:04:04+05:30 IST