ముగిసిన వెంకన్న తిరు కల్యాణోత్సవాలు
ABN , First Publish Date - 2021-03-01T06:24:48+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాయలంగా కొండదిగువ పూదోటలో ఉన్న పద్మావతి, అలిమేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన పుష్పయాగంతో ముగిశాయి.
సింహాచలం, ఫిబ్రవరి 28: వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాయలంగా కొండదిగువ పూదోటలో ఉన్న పద్మావతి, అలిమేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన పుష్పయాగంతో ముగిశాయి. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయదేవేరులతో ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన ఊంజలలో ఉంచి వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో ప్రత్యేక పూజలను దేవస్థానం పురోహితుడు కరి సీతారామాచార్యులు పర్యవేక్షణలో అర్చకుడు టీపీ రాజీవ్లోచన్ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.