వెంకటగిరి స్టేషన్‌ ఖాళీ!

ABN , First Publish Date - 2020-07-06T10:38:07+05:30 IST

మహమ్మారి కరోనా వెంకటగిరిని చుట్టేస్తోంది. మొన్నటిదాకా ప్రజలకు మాత్రమే సోకిన కరోనా ..

వెంకటగిరి స్టేషన్‌ ఖాళీ!

11 మందికి కరోనా

గూడూరు రూరల్‌ సీఐకు బాధ్యతలు

డక్కిలి కానిస్టేబుల్‌ పర్యవేక్షణ


వెంకటగిరి(టౌన్‌), జూలై 5 : మహమ్మారి కరోనా వెంకటగిరిని చుట్టేస్తోంది. మొన్నటిదాకా ప్రజలకు మాత్రమే సోకిన కరోనా ఇప్పుడు పోలీసులకూ అంటుకుంది. పోలీ్‌సస్టేషన్‌లో ఏకంగా 11 మందికి కరోనా సోకడంతో క్వారంటైన్‌కు తరలించారు. మిగిలినవారిని ఇళ్ల వద్ద ఉంచారు.  దీంతో స్టేషన్‌లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో డక్కిలికి చెందిన కానిస్టేబుల్‌ పర్యవేక్షిస్తున్నారు. గూడూరు రూరల్‌ సీఐ ఈ స్టేషన్‌ బాధ్యతలు తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, బంగారుపేటలో తొలి కరోనా కేసు నమోదవగా, మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా  కేసులు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-07-06T10:38:07+05:30 IST