వైభవంగా వేంకటేశ్వర స్వామి రథోత్సవం
ABN , First Publish Date - 2022-05-16T04:37:35+05:30 IST
వేంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని స్థానిక వేంకటేశ్వర ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు
మందమర్రిటౌన్, మే 15: వేంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని స్థానిక వేంకటేశ్వర ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు. మార్కెట్ సెంటర్ నుంచి పురవీదుల గుండా శోభాయాత్ర కొనసాగింది. మహిళలు కోలాటం ఆడుతూ స్వామి వారి కీర్తనలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుడు అనంతచార్యులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.