ఉద్యాన వర్సిటీకి అగ్రి ఎడ్యుకేషన్ అవార్డు
ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST
వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అగ్రి ఎడ్యుకేషన్ అవార్డు సొంతం చేసుకుంది.
తాడేపల్లిగూడెం, మార్చి 1(ఆంధ్రజ్యోతి):వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అగ్రి ఎడ్యుకేషన్ అవార్డు సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఇండియా టుడే గ్రూప్ దేశంలోని ఉన్న అన్ని వ్యవసాయ, ఉ ద్యాన విశ్వవిద్యాలయాల సేవలను మదింపు చేసి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి అవార్డును ప్రదానం చేసినట్టు వైస్చాన్సలర్ డాక్టర్ టి.జానకి రామ్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అనంతరం ఉపాధి కల్పన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు ప్రకటించారన్నారు.