ముగిసిన వెంకయ్య పర్యటన
ABN , First Publish Date - 2022-04-27T13:40:31+05:30 IST
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. ఆదివారం చెన్నై చేరుకున్న వెంకయ్య పలు కార్యక్రమాల్లో
చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. ఆదివారం చెన్నై చేరుకున్న వెంకయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర మంత్రి దురైమురుగన్, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం వెంకయ్య త్రిశూలం స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. ఆయనకు రాష్ట్ర మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివాల్, ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టి.జగన్నాధన్, దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ పీజీ మాల్యా తదితరులు వీడ్కోలు పలికారు.