వెంటిలేటర్ లేక ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-05-11T17:41:31+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి బ్రేక్ వేయడంలో విఫలమైన ప్రభుత్వం పలు ఆసుపత్రు లలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చడంలోనూ విఫలమైంది. దీంతో రోజురోజుకు కరోనా బా
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి బ్రేక్ వేయడంలో విఫలమైన ప్రభుత్వం పలు ఆసుపత్రు లలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చడంలోనూ విఫలమైంది. దీంతో రోజురోజుకు కరోనా బాధితుల మృతుల సంఖ్య అ ధికమవుతోంది. గదగ్ జిల్లా ముండరగి తాలూకా ఆసుపత్రిలో వెంటిలేటర్ లభించక సోమవారం ముగ్గురు మృతి చెందారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి వెంటిలేటర్ తప్పనిసరి. జిల్లాలోని జిమ్స్, కొప్పళ జిల్లాసుపత్రిలో కూడా వెంటిలేటర్లు పూర్తిగా నిండుకున్నాయి. ఇలా ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మృత్యువాత చెందారు. వీరిలో ఇద్దరు ముండరగి తాలూకా బిదరళ్ళి, బూదిహాళ గ్రామస్తులు కాగా ఒకరు కొప్పళ జిల్లా వాసి అని తెలుస్తోంది.