ఎంత ప్రమాదం!
ABN , First Publish Date - 2021-04-17T05:34:10+05:30 IST
హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బడి గేటు సందుల్లోంచి ఇలా దాటి, ప్రహరీ కింది నుంచి మురుగు కాలువ దాటుకొని వెళ్లిపోయారు.
హొళగుంద, ఏప్రిల్ 16: ఈ ఫొటో చూడండి.. రంజాన్ ప్రార్థనలకు వెళ్లడానికి శుక్రవారం హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బడి గేటు సందుల్లోంచి ఇలా దాటి, ప్రహరీ కింది నుంచి మురుగు కాలువ దాటుకొని వెళ్లిపోయారు. ఈ మురుగు కాలువలో పడిపోతే ఎంత ప్రమాదం? ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున మాట్లాడుతూ.. గేటు తాళాలు కనిపించకపోవడంతో విద్యార్థులు ఇలా ఇబ్బంది పడిన మాట వాస్తవం అని పాఠశాల వదిలే సమయానికి గేట్లు తెరిచామని అన్నారు.