వెటర్నరీలో ఎంసెట్ ద్వారానే ప్రవేశాలు
ABN , First Publish Date - 2020-11-29T05:49:20+05:30 IST
ఏపీ ఎంసెట్ ర్యాంకు ద్వారానే తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలోని బీవీఎస్సీ (అనిమల్ హస్బెండరీ), బీఎఫ్ఎస్సీ (ఫిషరీ) కోర్సుల్లో ప్రవేశాల్లో కల్పిస్తామని రిజిస్ట్రార్ మాధవరావు పేర్కొన్నారు
తిరుపతి (విద్య), నవంబరు 28: ఏపీ ఎంసెట్ ర్యాంకు ద్వారానే తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలోని బీవీఎస్సీ (అనిమల్ హస్బెండరీ), బీఎఫ్ఎస్సీ (ఫిషరీ) కోర్సుల్లో ప్రవేశాల్లో కల్పిస్తామని రిజిస్ట్రార్ మాధవరావు పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ, ఫిషరీ, డెయిరీ ప్రాసెసింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసినవారికి వెటర్నరీ, ఫిషరీ కోర్సుల్లో ప్రవేశాలు ఉండవని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని గమనించాలని ఆయన కోరారు.