వెటర్నరీ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచి కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం
ABN , First Publish Date - 2022-05-29T04:03:57+05:30 IST
ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచి అధ్యక్షుడిగా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.మహేశ్వరుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా మహేశ్వరుడు
నెల్లూరు(వ్యవసాయం), మే 28 : ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచి అధ్యక్షుడిగా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.మహేశ్వరుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు రైల్వేఫీడర్స్ రోడ్డులోని వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం అసోసియేషన్ నెల్లూరు బ్రాంచి ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని వెటర్నరీ పాలీ క్లీనిక్ల్లో పనిచేస్తున్న పశువైద్యులు, రిటైర్డ్ పశువైద్యులు పాల్గొని కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాఽధ్యక్షులుగా ఎం.మాలకొండయ్య, వి.ప్రభాకర్గుప్తా, వి.రాజ్యలక్ష్మి, వి.ధనుంజయరెడ్డి, ప్రధానకార్యదర్శిగా సీహెచ్. వెంకటేశ్వరరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా మహేంద్రబాబు, పి.అన్నపూర్ణ, ఎం.వెంకటస్వామిరెడ్డి, వై.ప్రియాంక, కోశాధికారిగా వైవీ.కామేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.