విజయనగరం: పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజు ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2020-08-08T12:31:12+05:30 IST

పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మృతి చెందాడు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే

విజయనగరం: పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజు ఆకస్మిక మృతి

విజయనగరం: పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మృతి చెందాడు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే ఆదిరాజు కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే కారులోనే ఆదిరాజు మృతి చెందారు. అయితే కరోనాతో మృతి చెంది ఉంటారేమో అన్న అనుమానంతో మృతదేహం వద్దకు వెళ్లేందుకు కూడా బంధువులు సాహసించని పరిస్థితి నెలకొంది.


మరోవైపు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయిన తరువాత... తానున్నానని కార్యాలయం తెరచిన మొదటి వ్యక్తి ఆదిరాజు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునః ప్రాణ ప్రతిష్ట చేశారు.  పార్టీ అధిష్టానం దృష్టిలో చురుకైన నేతగా మంచి గుర్తింపు పొందారు. పలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. మంత్రి బొత్స సత్యన్నారాయణ కుటుంబానికి ఆదిరాజు వీర విధేయుడుగా ఉండే వారు. యడ్ల ఆదిరాజు ఆకస్మిక మృతితో జిల్లా రాజకీయ నేతలు, పలు సంఘాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-08T12:31:12+05:30 IST