సీవీ రామన్ కృషి వల్లే ఈ నాటి విజ్ఞానం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-02-28T22:14:39+05:30 IST

జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల ప్రగతికి విజ్ఞాన శాస్త్రమే మూలాధారమని, భారతీయ నవ్య విజ్ఞాన శాస్త్ర ప్రగతికి సర్ సీవీ రామన్ చేసిన కృషి..

సీవీ రామన్ కృషి వల్లే ఈ నాటి విజ్ఞానం: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల ప్రగతికి విజ్ఞాన శాస్త్రమే మూలాధారమని, భారతీయ నవ్య విజ్ఞాన శాస్త్ర ప్రగతికి సర్ సీవీ రామన్ చేసిన కృషి చిరస్మరణీయం అని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఆదివారం వరుస ట్వీట్స్ చేశారు. ‘మానవ ప్రగతికి విజ్ఞాన శాస్త్రం మూలాధారం. జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా శాంతి, అభివృద్ధి మార్గంలో ప్రపంచ ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, ఆనందంగా తీర్చిదిద్దే దిశగా పరిశోధకులు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక సమాజం, ఔత్సాహిక పరిశోధకులకు శుభాకాంక్షలు. 1928లో ఇదే రోజున సర్ సీవీ రామన్ ఆవిష్కరించిన 'రామన్ ఎఫెక్ట్' ద్వారా భారతీయ నవ్య విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కిందం’టూ ఆయన తన ట్వీట్లు రాసుకొచ్చారు.



Updated Date - 2021-02-28T22:14:39+05:30 IST