Vice Presidential Polls: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖడ్

ABN , First Publish Date - 2022-07-18T19:54:58+05:30 IST

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే తరపున అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు..

Vice Presidential Polls: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖడ్

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే తరపున అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు నామినేషన్ పత్రాలను జగ్‌దీప్ ధన్‌ఖడ్ అందజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా.. పార్లమెంట్లో మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడారు.



ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగమని, దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు పార్లమెంటు సభ్యులు మాధ్యమంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. ఇది రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయమని, ఈ సమయం కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని అందించబోతోందని మోదీ చెప్పారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామని, పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-18T19:54:58+05:30 IST