ఎక్స్పోజర్ మ్యాచ్లలో హైదరాబాద్ జట్ల విజయం
ABN , First Publish Date - 2022-07-01T05:24:23+05:30 IST
కడప రిమ్స్ సమీప వైఎస్ రాజారెడ్డి- ఏసీఏ, కెఎ్సఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-14, అండర్-16 ఎక్స్పోజర్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్లు విజయం సాధించాయి.
కడప (మారుతీనగర్), జూన్ 30: కడప రిమ్స్ సమీప వైఎస్ రాజారెడ్డి- ఏసీఏ, కెఎ్సఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-14, అండర్-16 ఎక్స్పోజర్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్లు విజయం సాధించాయి. కెఎ్సఆర్ఎం మైదానంలో అండర్-14 హైదరాబాద్ టీమ్, కడప జట్ల మధ్య జరిగిన 50 ఓవర్ల మ్యాచ్లో టాస్ నెగ్గిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేపట్టి మొదటి ఇన్నింగ్స్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 318 పరుగులు సాధించింది.
ఇందులో ప్రేమ్ (బ్యాటర్) 79 పరుగులు చేయగా అర్జున్సా యి 76, వరుణ్ (బ్యాటర్) 74 పరుగులు చేశారు. కడప జట్టు 43.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో హైదరాబాద్ జట్టు 146 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. వైఎ్సఆర్ ఏసీఏ మైదానంలో అండర్-16 హైదరాబాద్, కడప జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లోనూ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 46.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఇందులో ఆర్యన్ రెడ్డి 73 పరుగులు, ఆర్.కె. ఆదిత్య 71 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేపట్టిన కడప వార్మప్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇందులో రోహిత్వర్మ 85 పరుగులు సాధించారు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరు వికెట్లతో గెలుపొందింది.