Madhav Video call: గోరంట్ల వ్యవహారంపై స్పందించిన రఘురామ
ABN , First Publish Date - 2022-08-04T17:44:50+05:30 IST
ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియోకాల్ (Video call) మాట్లాడారు. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) మాట్లాడిన
ఢిల్లీ: ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియోకాల్ (Video call) మాట్లాడారు. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) స్పందించారు. ‘‘సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి, ఎంపీ గోరంట్ల చూపించిన వీడియోకి సంబంధమే లేదు. రెండు వీడియోలను మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్కి పంపిస్తేనే ఘటనలో అసలు విషయం బయటపడుతుంది. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ వేగంగా స్పందించాలి. పార్లమెంటు సాక్షిగా నన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై మా పార్టీలో ఎవరు స్పందించాలన్నా.. తాడేపల్లిలో ఒక 'కీ' ఉంటుంది. తాడేపల్లి 'కీ' ప్రకారమే మా నేతలు నడుచుకుంటారు’’ అని రఘురామకృష్ణరాజు ఎద్దేవాచేశారు.
ఓ మహిళతో మాధవ్ నగ్నంగా వీడియోకాల్ (Video call) మాట్లాడారు. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District)లో మాధవ్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారనే ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారిగా ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమేనని పలువురు అంటున్నారు.