Mobiles: విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం

ABN , First Publish Date - 2022-09-21T17:52:44+05:30 IST

విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం విధించాలని సభాపతి రఘునాథరావు మల్కాపురె నిర్ణయించారు. ఈ విషయాన్ని

Mobiles: విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం

బెంగళూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం విధించాలని సభాపతి రఘునాథరావు మల్కాపురె నిర్ణయించారు. ఈ విషయాన్ని మంగళవారం పరిషత్‌లోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు ఎవరూ సభలోపల మొబైల్‌ వినియోగించకుండా ఈ నిషేధాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సభలో ప్రవేశించబోయేముందు సభ్యులంతా తమ మొబైల్‌ను బయట ఉంచిన లాకర్‌లో భద్ర పరచుకోవాల్సి ఉంటుందన్నారు. మీడియాకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. మొబైల్‌ వాడకం సంపూర్ణంగా అమలులోకి వచ్చిన తొలి విధానపరిషత్‌గా కర్ణాటక త్వర లో అరుదైన రికార్డు అందుకోనుందన్నారు. 

Updated Date - 2022-09-21T17:52:44+05:30 IST