విద్యాభివృద్ధికి ఎన్నారైల సహకారం
ABN , First Publish Date - 2022-01-22T06:41:30+05:30 IST
విద్యాభివృద్ధికి ఎన్నారైల సహకారం
హనుమాన్జంక్షన్ రూరల్, జనవరి 21 : గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యాభివృద్ధికి సహ కారమందిస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమని, ఆర్ఆర్డీఎస్ కార్యదర్శిగా తనతండ్రి అందిస్తున్న సేవల స్ఫూర్తితోనే తనవంతు సహకారమందిచడం జరిగిందని ఎన్నారై ఆళ్ల వంశీకృష్ణ తెలిపారు. రంగన్నగూడెంకు చెందిన కొలుసు జాహ్నవికి సీపెట్లో మెరిట్ ర్యాంకు సాధించినం దుకు అభినందించి ఉపకార వేతనాన్ని వంశీకృష్ణ, అనూజ్ఞ దంపతులు శుక్రవారం అందజేశారు. టెక్సాస్లోని హార్వేర్డ్ సంస్ధల ఏఎండీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వంశీకృష్ణ సంక్రాంతి పండుగకు స్వగ్రామం వచ్చిఎన్నారైలసహకారంతో ఆర్ఆర్డీఎస్ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి తన వంతు సాయాన్ని తండ్రి ఆళ్ల గోపాలకృష్ణ ద్వారా అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్డీఎస్ అధ్యక్షుడు తుమ్మల దశరధరామయ్య, మాజీ సర్పంచ్ మణికృష్ణ, ఆళ్ల కుమార్తె సిరిచందన తదితరులు పాల్గొన్నారు.