విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వినతి
ABN , First Publish Date - 2022-07-07T03:07:51+05:30 IST
విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఎంఈవో కే.రవికుమార్కు బుధవా
కొండాపురం, జూలై6: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఎంఈవో కే.రవికుమార్కు బుధవారం వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. నూతన విద్యావిధానంతో పలుపాఠశాలల విలీనంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యాశాఖాధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండు చేశారు. పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ టీ.లక్ష్మీనారాయణ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్రకార్యదర్శి చెరుకూరు నవీన్, మండల తెలుగు యువత అధ్యక్షుడు దాసరి అశోక్, కుమ్మర వెంకటరావు, చెరుకూరు శేషయ్య, మందపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.