విద్యుదాఘాతంతో విద్యార్థి దుర్మరణం
ABN , First Publish Date - 2022-01-23T04:07:37+05:30 IST
విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాళెంలో శనివారం
దర్గాకు డెకరేషన్ చేస్తుండగా దుర్ఘటన
బుచ్చిరెడ్డిపాళెం,జనవరి 22 : విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాళెంలో శనివారం ఉదయం జరిగింది. ఎస్ఐ ప్రసాద్రెడ్డి కథనం మేరకు, బుచ్చి కోదండరామపురానికి చెందిన చిన్నంగారి రాము, జానకిల చిన్న కొడుకు కార్తీక్(22) ఇస్కపాళెంలోని ఓ దర్గాలో ఉత్సవాల సందర్భంగా శనివారం ఉదయం విద్యుత్ దీపాలంకరణ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యా డు. వెంటనే బుచ్చిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని గండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కార్తీక్ ఆత్మకూరులోని ఓ ఐటీఐలో చదువుకుంటూ సెలవు రోజుల్లో కూలి పనులు చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవా డు. అతని మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుము కున్నాయి.
------