అంతర్జాతీయ ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగించనున్న వియత్నాం

ABN , First Publish Date - 2022-02-14T03:08:19+05:30 IST

అంతర్జాతీయ విమానసర్వీసులపై ప్రస్తుతమున్న అన్ని కరోనా ఆంక్షలను తొలగించేందుకు వియత్నాం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అంతర్జాతీయ ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగించనున్న వియత్నాం

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ విమానసర్వీసులపై ప్రస్తుతమున్న అన్ని కరోనా ఆంక్షలను తొలగించేందుకు వియత్నాం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి అన్ని సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం అనుమతించబోతున్నట్టు అక్కడి మీడియా పేర్కొంది. ఫ్లైట్ల సంఖ్యను కరోనా పూర్వపు సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. కాగా... వియత్నాం ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచీ 15 దేశాలకు ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించింది. మరోవైపు.. శనివారం నాడు దేశవ్యాప్తంగా కొత్తగా 27 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 

Updated Date - 2022-02-14T03:08:19+05:30 IST