రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2021-06-17T05:55:04+05:30 IST
మండలంలోని జానకంపేట, చినలాటవరపి గ్రామాల్లో రెండు రేషన్ షాపులపై జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం... జానకంపేట 9 వ నెంబర్ రేషన్ షాపులో నిల్వ ఉండాల్సిన 39 బస్తాల రేషన్ బియ్యం కనిపించకుండా పోయాయని, అదే షాపులో మరో 50 ప్యాకెట్లు పంచాల్సిన చక్కెర, అలాగే 10 ప్యాకెట్ల కందిపప్పు పంచకుండా నిల్వ ఉన్నట్లు గుర్తించారు.
గుడ్లూరు, జూన్ 16 : మండలంలోని జానకంపేట, చినలాటవరపి గ్రామాల్లో రెండు రేషన్ షాపులపై జిల్లా విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం... జానకంపేట 9 వ నెంబర్ రేషన్ షాపులో నిల్వ ఉండాల్సిన 39 బస్తాల రేషన్ బియ్యం కనిపించకుండా పోయాయని, అదే షాపులో మరో 50 ప్యాకెట్లు పంచాల్సిన చక్కెర, అలాగే 10 ప్యాకెట్ల కందిపప్పు పంచకుండా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా చినలాటవరపిలోని 10 వ నెంబర్ రేషన్ రేషన్ షాపులో 8 బస్తాల రేషన్ బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా అవి కనిపించకుండా మాయం అయ్యాయి. అదే షాపులో వినియోగదారులకు అందించాల్సిన 23 ప్యాకెట్ల చక్కెర కూడా నిల్వ ఉన్నట్లు ఈ సందర్బంగా విజిలెన్స్ అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రెండు షాపులకు చెందిన రేషన్ డీలర్లు కృష్ణవేణి, సౌమ్యలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనీఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్ధార్ ఎస్. రామనారాయణరెడ్డి, ఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది ఫాల్స్యామ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.