శారదా పీఠంలో ముగిసిన విజయదశమి వేడుకలు
ABN , First Publish Date - 2021-10-17T05:45:39+05:30 IST
చినముషిడివాడలోని శారదా పీఠంలో విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.
పెందుర్తి రూరల్, అక్టోబరు 16: చినముషిడివాడలోని శారదా పీఠంలో విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రాజశ్యామల అమ్మవారిని విజయదుర్గాదేవిగా అలంకరించారు. ఆలయ ఆవరణలో ఉన్న శమీ వృక్షం వద్ద ఆయుధ పూజ, వాహన పూజను పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.