విజయనగరం: మెంటాడ మండలంలో యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-04-30T21:46:14+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. మెంటాడ మండలంలో యువకుడిని

విజయనగరం: మెంటాడ మండలంలో యువకుడి దారుణ హత్య

విజయనగరం: జిల్లాలో దారుణం జరిగింది. మెంటాడ మండలంలో యువకుడిని కొందరు హత్య చేశారు. యువకుడు గేదెలు గణేష్‌ని ప్రత్యర్ధులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి కత్తిపోట్లు అయ్యాయి. రెండ్రోజుల క్రితం జ్యోతి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యతో మృతురాలి కుటుంబం ప్రతీకారంతో రగిలిపోయింది. మృతురాలి బంధువులు కత్తులతో వచ్చి వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో మృతురాలి మరిది గణేష్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-30T21:46:14+05:30 IST