Vijayanagaram: ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీకి లాకౌట్...కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2021-12-01T17:22:07+05:30 IST
జిల్లాలోని సీతానగరం మండలంలో గల ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది.
విజయనగరం: జిల్లాలోని సీతానగరం మండలంలో గల ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది. కర్మాగారానికి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందుకు నిరసనగా కార్మకులు ఆందోళనకు దిగారు. జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసినందుకే లాకౌట్ ప్రకటించారంటూ నిరసన చేపట్టారు. రూ.6 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులు ఇటీవలే నిరసన తెలిపిన విషయం తెలిసిందే.