యాదగిరిగుట్టపై భక్తుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-17T23:27:34+05:30 IST

హైదరాబాద్: యాదాద్రిలో భ‌క్తుల ఇబ్బందులు వర్ణనాతీతమని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు.

యాదగిరిగుట్టపై భక్తుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు: విజయశాంతి

హైదరాబాద్: యాదాద్రిలో భ‌క్తుల ఇబ్బందులు వర్ణనాతీతమని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. ఎర్రటి ఎండలో బండలపై కాళ్లు కాలుతున్నాయని,  నిలబడడానికి నీడ కూడా లేకుండాపోయిందని ఆమె ఆరోపించారు. గొంతు తడారిపోతున్నా తాగడానికి చుక్క నీరు లేదన్నారు. రూ.1,200 కోట్లతో పునర్నిర్మించి ప్రారంభించిన యాదగిరిగుట్టపైన భక్తుల తిప్పలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆరేండ్ల తర్వాత యాదాద్రిని అన్ని హంగులతో ప్రారంభించామని కేసీఆర్ సర్కారు చెబుతున్నా... భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో చెప్పే బోర్డులన్నా ఏర్పాటు చేయలేదని, కొండపైన, కొండ కింద షాపులు లేకపోవడంతో పూజా సామగ్రి ఎక్కడ కొనాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని విజయశాంతి చెప్పారు. 



Updated Date - 2022-04-17T23:27:34+05:30 IST