వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2022-03-12T00:20:49+05:30 IST

హైదరాబాద్: కేసీఆర్ మ‌రోసారి నిరుద్యోగుల‌ను మోసం చేయ‌డానికి రెడి అవుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి: విజయశాంతి

హైదరాబాద్: కేసీఆర్ మ‌రోసారి నిరుద్యోగుల‌ను మోసం చేయ‌డానికి రెడి అవుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ప్రశాంత్‌ కిషోర్‌తో క‌లిసి నిరుద్యోగుల‌తో స‌రికొత్త డ్రామా షూరూ చేశారని చెప్పారు. గ‌తంలో 4 ల‌క్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని చెప్పి ఇప్పుడు కేవ‌లం 80వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ అంటున్నారని విజయశాంతి కన్నెర్ర చేశారు. ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ ఖాళీలు ప్రస్తుతం 3 లక్షలకు పెరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగ‌ర‌డం త‌ట్టుకోలేక కేసీఆర్ ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. 



Updated Date - 2022-03-12T00:20:49+05:30 IST