వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి: విజయశాంతి
ABN , First Publish Date - 2022-03-12T00:20:49+05:30 IST
హైదరాబాద్: కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రెడి అవుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
హైదరాబాద్: కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రెడి అవుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్తో కలిసి నిరుద్యోగులతో సరికొత్త డ్రామా షూరూ చేశారని చెప్పారు. గతంలో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు కేవలం 80వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ అంటున్నారని విజయశాంతి కన్నెర్ర చేశారు. ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ ఖాళీలు ప్రస్తుతం 3 లక్షలకు పెరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరడం తట్టుకోలేక కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.