Vijayashanthi : కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే Ghmc కుప్పకూలింది

ABN , First Publish Date - 2021-08-01T23:47:18+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయాల ఫలితంగా జీహెచ్‌ఎంసీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి

Vijayashanthi : కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే Ghmc కుప్పకూలింది

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయాల ఫలితంగా జీహెచ్‌ఎంసీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఒకప్పుడు నిధులతో కళకళలాడిన ఈ హైదరాబాద్ నగర పాలక సంస్థ నేడు స్వంత ఉద్యోగులకు సైతం జీతాలివ్వలేక, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించలేక నానా పాట్లు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు గుడ్డు పెట్టే బాతును ఎక్కువ గుడ్ల కోసం దురాశతో చంపేసిన కథను ఉటంకించిన విజయశాంతి... అలాంటి వ్యక్తే సీఎం కేసీఆర్ అని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ నుంచి బిల్లులు వస్తాయని నమ్మి... అప్పులు చేసి మరీ పనులు చేస్తున్నవారిని సైతం నట్టేట ముంచే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఐదేళ్ళ కిందట సుమారు మిగులు నిధులతో ఉన్న జీహెచ్ఎంసీ, నేడున్న దయనీయస్థితిలో ఉండిపోయిందని అన్నారు. 



Updated Date - 2021-08-01T23:47:18+05:30 IST