కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం వల్లే ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ రాకుండా పోయింది: విజయశాంతి

ABN , First Publish Date - 2022-03-17T01:15:47+05:30 IST

హైదరాబాద్: కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం వ‌ల్ల తెలంగాణ‌కు రావాల్సిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం (జీసీటీఎం) రాకుండా పోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం వల్లే ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ రాకుండా పోయింది: విజయశాంతి

హైదరాబాద్: కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం వ‌ల్ల తెలంగాణ‌కు రావాల్సిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం (జీసీటీఎం) రాకుండా పోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. భాగ్యన‌గ‌రం వేదిక‌గా జీసీటీఎం నెలకొల్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పంద‌న క‌రువైందన్నారు. నేరుగా సీఎస్‌కే లేఖ రాసినా.. సీఎస్‌గానీ, సీఎంగానీ దాని మీద స్పందించలేదన్నారు. 2021 మొదట్లోనే తెలంగాణ సర్కారు స్పందించి ఉంటే జీసీటీఎం తెలంగాణలోనే ఏర్పాటై ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. 



Updated Date - 2022-03-17T01:15:47+05:30 IST