జనం తలలు పట్టుకొని కూర్చున్నారు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-05-07T21:48:30+05:30 IST

తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు

జనం తలలు పట్టుకొని కూర్చున్నారు: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉందని, ప్రభుత్వ వైఖరితో ప్రజలు తలలు పట్టుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి విమర్శించారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిని ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని, ధాన్యం సేకరణ కూడా తీవ్రంగా గాడి తప్పుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై శుక్రవారం ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.


‘‘తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్పల్పకాల లాక్‌డౌన్ విధించాయి. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి లాక్‌డౌన్ వల్ల ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిని ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని, ధాన్యం సేకరణ కూడా తీవ్రంగా గాడి తప్పుతుందని సీఎం కేసీఆర్ సెలవిచ్చారు. అయితే, గతంలో సరి, బేసి సంఖ్యలో దుకాణాలు తెరవడానికి అవకాశమివ్వడం.. కోవిడ్ నియంత్రణకు పరిమితుల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, ఉద్యోగ, కార్మిక కార్యకలాపాలు నడిచేలా పాస్‌లు జారీ చేయడం.. వంటి చర్యలతో పరిస్థితిని కొంత అదుపు చేసిన సంగతి గుర్తు లేదా? ఇక రాష్ట్రంలో కరోనా చికిత్స తీరు, టెస్టుల నిర్వహణ, బెడ్లు, మందులు, వాక్సీన్ అందుబాటుపై దాదాపు రోజూ అధికారులకు కోర్టు మందలింపులు, మీడియా కథనాలు వాస్తవాల్ని చూపిస్తుంటే.. సీఎస్ గారు, సీఎం గారు మాత్రం అంతా బాగుందన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. ఒక రోజు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెబుతారు. మరొక రోజు కేంద్రంపై నిందలేస్తూ విమర్శలు చేస్తారు. పరిస్థితిని కట్టడి చెయ్యలేని ఈ తెలంగాణ పాలకుల తీరుపై ఏం చెయ్యాలో తెలియక జనం తల పట్టుకుని కూర్చున్నారు’’ అని తన ఫేస్‌బుక్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయశాంతి రాసుకొచ్చారు.



Updated Date - 2021-05-07T21:48:30+05:30 IST