విజయాశ్వం మరో హిట్టు

ABN , First Publish Date - 2022-07-01T08:42:57+05:30 IST

ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరో హిట్టు కొట్టింది.

విజయాశ్వం మరో హిట్టు

  • ఇస్రో వాణిజ్య ప్రయోగం విజయవంతం
  • 3 సింగపూర్‌ ఉపగ్రహాలతో 
  • పీఎస్‌ఎల్వీ-సీ53 నింగిలోకి


శ్రీహరికోట (సూళ్లూరుపేట), జూన్‌ 30: ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరో హిట్టు కొట్టింది. మూడు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి రివ్వున ఎగిరిన పీఎ్‌సల్వీ-సీ53 వాటిని విజయవంతంగా కక్ష్యల్లోకి చేరవేసింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఐఎల్‌)కు అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌ఎ్‌సఐఎల్‌ ఒప్పందం మేరకు మూడు సింగపూర్‌ ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యల్లోకి చేరవేశారు. పీఎ్‌సఎల్వీ 55వ సారి (పీఎ్‌సఎల్వీ-సీ53) రోదసిలోకి దూసుకెళ్లి ఎన్‌ఎ్‌సఐఎల్‌ వాణిజ్య ఒప్పందాన్ని నేరవేర్చింది. 


ఇలా రోదసిలోకి..

ప్రయోగం కోసం బుధవారం మధ్యాహ్నం 4.02 గంటలకు ప్రారంభమైంది. అది 26 గంటలపాటు కొనసాగి గురువారం సాయంత్రం 6.02 గంటలకు ముగియగానే 228.4 టన్నుల బరువున్న పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ 522.8 కిలోల బరువున్న మూడు సింగపూర్‌ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకుపోయింది. 4 దశల ఈ రాకెట్‌లోని ఒక్కో దశను శాస్త్రవేత్తలు పనిచేయిస్తూ రోదసిలోకి పయనింపజేశారు. 18 నిమిషాలలో రాకెట్‌ను భూమధ్య రేఖకు 570 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చి తొలుత డీఎ్‌స-ఈవో ఉపగ్రహాన్ని విడిచిపెట్టారు. తదుపరి 19.18 నిమిషాలకు ఎంఈయూఎ్‌సఏఆర్‌ను, 19.26 నిమిషాలకు స్కూబ్‌-1 ఉపగ్రహాలను విడిచిపెట్టారు. మరో 6 నిమిషాలకే ఈ ఉపగ్రహాల సంకేతాలు ఇండోనేసియాలోని బ్రూనై, బియాస్‌ భూకేంద్రాలకు అందడంతో షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు. 


రాకెట్‌ నాల్గవ దశతో భూ ప్రదక్షిణ

నాలుగు దశలపీఎ్‌సఎల్వీ రాకెట్‌లో ఒక్కో దశ పనిచేస్తూ రాకెట్‌ను నిర్ణీత ఎత్తుకు చేర్చి విడిపోతుంటాయి. మూడు దశలు విడిపోయిన తరువాత నాల్గవ దశ (పీఎస్‌-4) ఉపగ్రహాలతో నిర్ణీత కక్ష్యకు చేరి వాటిని వదిలి రోదసిలో కలసిపోతుంటుంది. అయితే తొలిసారిగా ఇస్రో ఈ నాల్గవ దశ పీఎస్‌- 4ను పీఎ్‌సఎల్వీ, ఆర్బిటల్‌, ఎక్స్‌పర్‌మెంటల్‌ మాడ్యూల్‌ (పీవోఈఎం)గా రూపొందించి దాన్ని భూమి చుట్టూ తిరిగేలా చేశా రు. ఇందులో ఆరు పేలోడ్లను ఏర్పాటు చేశారు. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయనున్నారు. 


ఎన్‌ఎ్‌సఐఎల్‌ రెండో వాణిజ్య ప్రయోగం

ఇస్రోవాణిజ్య విభాగంగా కేంద్రప్రభుత్వం 2019లో న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. దాంతో ఎన్‌ఎ్‌సఐఎల్‌, టాటాస్కైకి సమాచార ఉపగ్రహాన్ని అందించేలా తొలి ఒప్పం దం చేసుకొని జూన్‌ 23న ఫ్రెంచ్‌ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌-24 ఉపగ్రహాన్ని కక్ష్యల్లోకి చేరవేయించింది. సరిగ్గా 7 రోజులకు స్వదేశం నుంచి సింగపూర్‌కు చెందిన 3 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ఇస్రో ద్వారా చేరవేయించింది. 


ఈ సారి చంద్రుడిపై దించుతాం: సోమనాథ్‌ 

చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఈ సారి ల్యాండర్‌ను చంద్రు ని ఉపరితలంపై కచ్చితంగా దించుతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మానవసహిత గగనయాన్‌ ప్రయోగానికి ముందు మానవ రహిత ప్రయోగాలను చేపడుతున్నామని, ఈ ఏడాది చివర్లో ఈ ప్రయోగం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాదిగానీ గగన్‌యాన్‌ ప్రయోగం ఉండదని స్పష్టం చేశారు. జూలై చివరిలో చిన్న చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తామని వెల్లడించారు. అలాగే సూర్యశోధనకు ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై కూడా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  

Updated Date - 2022-07-01T08:42:57+05:30 IST