కృష్ణానదిలో యువకుడు గల్లంతు..

ABN , First Publish Date - 2021-07-25T18:27:54+05:30 IST

విజయవాడ: కృష్ణానదిలో స్నానానికి దిగిన యువకులు గల్లంతయ్యారు.

కృష్ణానదిలో యువకుడు గల్లంతు..

విజయవాడ: కృష్ణానదిలో ముగ్గురు స్నేహితులు స్నానానికి దిగారు. అందులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. భవనీపురం సూరనా ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు స్నేహితులు కృష్ణానదిలో దిగారు. వరద ప్రవాహానికి యువకుడు రాజశేఖర్ గల్లంతయ్యాడు. మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నదిలో కొట్టుకుపోయిన యువకుడు గుంటూరుకు చెందిన రాజశేఖర్‌గా గుర్తించారు. అతని కోసం రెస్క్యూ ఆపరేషన్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-07-25T18:27:54+05:30 IST