విజయవాడ: ఆస్తిపన్ను పెంపుపై విపక్షాల నిరసన

ABN , First Publish Date - 2021-07-28T17:29:03+05:30 IST

విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం దుమారంరేపుతోంది.

విజయవాడ: ఆస్తిపన్ను పెంపుపై విపక్షాల నిరసన

విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం దుమారంరేపుతోంది. ప్రజలపై భారం మోపుతున్నారంటూ ఆస్తి పన్ను పెంపుపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి. కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టకుండా ఎలా అమలు చేస్తారంటూ విపక్షాలు నిలదీశాయి. కాగా బుధవారం 198 జీవోపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జీవో ఆమోదించకుండా విపక్షాలు అడ్డుపడ్డాయి. ఎలాగైనా ఆమోదించుకోవాలని అధికారపార్టీ నేతలు చూస్తున్నారు. మరోవైపు వామపక్షాలు, టీడీపీ నేతలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 198 జీవోపై నగరపాలక సంస్థ కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద  ప్రత్యేక చర్చ జరుగుతోందన్నారు. వైసీపీ కార్పొరేటర్లు ప్రజా పక్షంగా ఉండారా? లేక 198 జీవో పక్షం ఉంటారన్నది తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జీవో ఆమోదం పొందితే ప్రజలపై పన్ను భారం పడుతుందన్నారు. 

Updated Date - 2021-07-28T17:29:03+05:30 IST