రూ.500కు టీవీ అమ్ముతూ పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు

ABN , First Publish Date - 2021-03-01T17:05:57+05:30 IST

నగరంలోని జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన ఎలక్ర్టానిక్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.500కు టీవీ అమ్ముతూ పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు

విజయవాడ: నగరంలోని జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన ఎలక్ర్టానిక్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌరవరం వద్ద రూ.500 టీవీని అమ్మేందుకు ప్రయత్నింస్తుండగా అనుమానవం వచ్చిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఎనికేపాడు ఎల్‌జీ షోరూమ్‌ నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ర్టానిక్‌ పరికరాలతో సిద్ధంగా ఉంచిన ఆటోను యూపీకి చెందిన వ్యక్తులు దొంగిలించి పారిపోయారు. ఎనికేపాడు ఎల్‌జీ షోరూమ్‌ వద్ద దొంగిలించి వాటిని హైదరాబాద్‌ తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో గౌరవరం వద్దకు రాగానే డీజిల్‌ అయిపోవటంతో టీవీని రూ.500లకు అమ్మే ప్రయత్నంలో ఘరానా దొంగలు పోలీసులకు చిక్కారు. 

Updated Date - 2021-03-01T17:05:57+05:30 IST