విజయవాడ బాధితురాలకి రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-22T18:29:27+05:30 IST

విజయవాడ బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.

విజయవాడ బాధితురాలకి రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబు

విజయవాడ: విజయవాడ బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని... నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు.


మరోవైపు విజయవాడ ఆస్పత్రి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకునే ముందు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్టి పద్మ అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు వచ్చినా అక్కడి నుండి వాసిరెడ్డి పద్మ అక్కడి నుంచి బయటకు రాకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ఆస్పత్రికి వచ్చిన వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  ఆందోళనకారులను పక్కకు లాగిన పోలీసులు.. అతి కష్టం మీద వాసిరెడ్డి పద్మను ఆసుపత్రి లోపలకి పంపించారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2022-04-22T18:29:27+05:30 IST