Vijayawada: పిడుగుపడి ఇళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-06-06T17:18:33+05:30 IST

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్దగొల్లపాలెంలో పిడుగు పడి ఇల్లు దగ్ధమైంది.

Vijayawada: పిడుగుపడి ఇళ్లు దగ్ధం

విజయవాడ: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్దగొల్లపాలెంలో పిడుగు పడి ఇల్లు దగ్ధమైంది. సోమవారం ఉదయం పూరి ఇంటిపై పిడుగు పడటంతో ఒక్కసారికి మంటలు వ్యాపించాయి. పిడుగు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-06-06T17:18:33+05:30 IST