మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-11-08T14:48:54+05:30 IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామివారి ఆలయానికి  భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ఆలయం వద్ద పుట్టలో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు.  అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్వామివారి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం  దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-11-08T14:48:54+05:30 IST