భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానంద భారతి

ABN , First Publish Date - 2021-11-13T17:27:07+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శ్రీ భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా శ్రీ శ్రీశ్రీ కామలానంద భారతీ స్వామి నియమితులయ్యారు.

భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానంద భారతి

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శ్రీ భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా శ్రీ శ్రీశ్రీ కామలానంద భారతీ స్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో స్వామి కమలానంద భారతీ స్వామికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతీ స్వామి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘ నేతలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-13T17:27:07+05:30 IST